మళ్లీ వేములవాడ టికెట్ నాదే : ఎమ్మెల్యే రమేశ్ బాబు

-

మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ ప్రచార వ్యూహాన్ని పదును పెడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అని.. కొందరు మాత్రం తమ తీరు మార్చుకోకపోతే వాళ్లని మార్చేస్తామని కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు స్పందించారు.

వేములవాడ నియోజకవర్గానికి ఈసారి డిమాండ్ పెరగడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. తనకు టికెట్ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పని తీరు బాగోలేని ఎమ్మెల్యేలను సీఎం వ్యక్తి గతంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారని.. తన పేరు మాత్రం అందులో లేదని చెప్పుకొచ్చారు.ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో తనకే వేములవాడ టికెట్ వస్తుందని కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు చెన్నమనేని వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news