కాంగ్రెస్‌ పార్టీలోకి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ?

-

కాంగ్రెస్‌ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు. తనకు ఈ మేరకు మాత్రమే సమాచారం ఉందని చెప్పారు. అదే రోజు మక్తల్‌ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని తెలిపారు.

C-PAC PREDICTS 11 LOK SABHA SEATS FOR BRS IN TELANGANA

మరోవైపు రుణమాఫీ గురించి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ మీద అనవసర రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టు లాంటివని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు.. రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

అటు పది రోజుల కిందట బీఆర్ఎస్ కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అందులో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీకి చెందిన వారు కాంగ్రెస్ లో చేరతారనే కథనాలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడకు చెందిన పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా, మరో 7-8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ బాటలో ఉన్నారనే ఫీలర్లు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news