మోరంచపల్లి గ్రామస్థులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గండ్ర

-

మోరంచపల్లి గ్రామస్థులకు అండగా నిలిచారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల వల్ల పలు రాష్ట్రాల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ప్రభావం తీవ్రంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణలపై వరద భీబత్సం సృష్టిస్తుంది.

ముఖ్యంగా భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే ముగ్గురు గ్రామస్తులు వరదలో కొట్టుకుపోగా… ఇళ్లలోని సామాన్లు వరద పాలయ్యాయి. ఇప్పుడు మొరంచపల్లి గ్రామం వదిలి బంధువుల గ్రామాలకు తరలివెళ్లారు జనాలు. ఈ నేపథ్యంలోనే.. మోరంచపల్లి గ్రామస్థుల కన్నీటి గాథలు విని.. పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకుంటున్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news