చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు పిచ్చి లేసింది – కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి

-

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు పిచ్చి లేసిందంటూ ఫైర్‌ అయ్యారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నాలుగు సంవత్సరాల కాలంలో పార్టీలకు అతీతంగా 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని వివరించారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు ..పవన్ కళ్యాణ్ లు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు మతిభ్రమించిందని ఫైర్‌ అయ్యారు. వాళ్ల పార్టీలు రెండూ అధికారంలోకి రావని వాళ్ళ మనసులను తెలుసు అన్నారు. వాళ్లు ముఖ్యమంత్రులు అయ్యేది లేదు …అది వాళ్ళ మనస్సాక్షికి తెలుసని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా మళ్లీ వై.సి.పి.దే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేశారు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news