మార్చి 15న సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ

-

ఎమ్మెల్సీ కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత వర్సెస్ ఈడీగా ఈ కేసు నడుస్తోంది. మార్చి 15, శుక్రవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ చేపట్టనున్నారు. కోర్టు నెంబర్ 15 లో 34 వ కేసుగా లిస్ట్ అయింది కల్వకుంట్ల కవిత కేసు.

లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈ డీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు కవిత. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిటల్ ల ధర్మాసనం మార్చి 15, శుక్రవారం నాడు ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news