నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు: బీజేపీ ఎంపీ అర్వింద్

-

mp aravind comments on d srinivas: నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ఎమోషనల్ అయ్యారు. తండ్రి మృతిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ అయ్యారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు.

mp aravind comments on d srinivas

ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే! ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా.. ! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు.’ అని ప్రకటన చేశారు.

కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్… ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3 గంటలకు గుండెపోటు రావటంతో… మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news