BREAKING: మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

-

KCR: BRS అధినేత కేసీఆర్‌కు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో ఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసి మరీ మీతోనే ఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు.

Former CM KCR 

ఈ నేపథ్యంలో పార్టీకి మరో భారీ షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదు. ఇక తాజా గా పార్టీ మారే నాయకుల పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగల్లా కలిసెటోళ్ల గురించి బాధలేదు..తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా.? అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అధినేత కేసీఆర్ భరోసా నింపారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప..నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు.. స్పష్టం చేసిన కేసీఆర్… నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news