ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదు: ధర్మపురి అరవింద్

-

పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా రెండంకెల స్థానాల్లో గెలవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఓవైపు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రస్తుత సర్కార్ వైఫల్యాలపై మండిపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై వరుస విమర్శలు చేస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు కూడా తమ దైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటర్ల వద్దకు వెళ్తూ ఈ పదేళ్లలో మోదీ సర్కార్ ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. అలాగే గత బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని, బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తే.. రేవంత్ రెడ్డిని దేవుడే కాపాడాలని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతాయని తెలిపారు. కాంగ్రెస్‌లో రాజకీయాలు మొదలయ్యాయన్న అరవింద్.. వంద రోజుల్లో అమలు కాని గ్యారంటీలు ఆగష్టు తర్వాత ఎలా అమలు అవుతాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news