BREAKING: సీఎం జగన్‌ పై దాడి చేసింది 5 గురు ?

-

ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పురోగతి వచ్చింది. ఈ సంఘటనలో ఏకంగా ఐదుగురు యువకుల బృందాన్ని అదుపులోకి తీసుకుంది సిట్. ఈ ఐదుగురిలో ఒక యువకుడు సీఎం జగన్ పై దాడికి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు.

Campaign is another danger for CM Jagan

సీసీఏస్ పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకే చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు. దాడి చేయటం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు పోలీసులు. సీఎం జగన్ బస్సు యాత్రలో వచ్చినపుడు పబ్లిక్ లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియో లను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించినట్టు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news