అమిత్ షా తో ఎంపీ ఈటెల భేటీ

-

లోక్ సభ ఎన్నికలు ముగిసినా తెలంగాణలో రాజకీయ వేడి తగ్గలేదు. సార్వత్రిక ఎన్నికల్లో 8 స్థానాల్లో జెండా పాతిన బీజేపీ నెక్స్ట్ స్టేట్ పాలిటిక్స్ లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడంతో ఆయన బాధ్యతలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది. సోమవారం ఢిల్లీలో అమిత్ షా తో ఈటల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల చేతికి రాబోతున్నాయనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ విషయాన్ని తానెలా చెప్పగలను, తనకు అధ్యక్షత బాధ్యతలు అనే విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్ వే ఉందని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించిందన్నారు. 2019లో 4. ఎంపీ స్థానాలు ఉండగా 2024లో 8 స్థానాలకు ఎదిగామన్నారు. తమకు ఓటు పర్సంటేజీ శాతం కూడా 35 శాతం వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news