కాంగ్రెస్ పార్టీలోకి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ?

-

పార్టీ మారే యోచనలో బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది . ఈ నేపథ్యంలో వివిధ రాజకీయా పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఈ తరుణంలోనే తెలంగాణ బీజేపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ టికెట్‌పై బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తిలో ఉన్నారు ఎంపీ సోయం బాపురావు.

mp soyam baburao into congress

దీంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే యోచనలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇటీవలే…టికెట్‌ తనకు రాకపోవడంపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని ఫైర్‌ అయ్యారు.ఆదివాసీ బిడ్డ రెండో సారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో నాకు టిక్కెట్ రాకుండా చేశారు బీజేపీ తెలంగాణ అగ్రనేతలు అంటూ ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు.

Read more RELATED
Recommended to you

Latest news