45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా : మురళీధరన్

-

45 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండో జాబితా ఉంటుందని ప్రకటించారు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్. కమ్యూనిస్టులతో చర్చలు జరుగుతున్నాయని, చేరో రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు.

Muralidharan on congress party second list

సిట్టింగ్ స్థానాలను ఇచ్చే ప్రసక్తే లేదని, ఏ స్థానాలు ఇవ్వాలి అనే విషయంపై ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు. ఇవాళ సాయంత్రం 45 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేశామని స్పష్టం చేశారు. కాగా, సీఎం కేసీఆర్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు మోత్కుపల్లి నరసింహులు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులుతో పాటు… కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version