రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభం

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలో దూసుకుపోతున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్‌. ఈ తరుణంలోనే..అక్టోబర్ 2న నల్లగొండ ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇక నిన్న స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nalgonda IT Tower to be inaugurated on October 2 by Minister KTR

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌క‌ల క‌రెంట్ గ్యారెంటీ, సంవ‌త్స‌రానికి ఒక ముఖ్య‌మంత్రి దిగ‌డం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వ‌ర‌కు అన్ని కుంభ‌కోణాలే. ఆ కుంభ‌కోణాల కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవ‌డం ఖాయం అని కేటీఆర్ అన్నారు. రూ. 50 కోట్ల‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కొన్నాడ‌ని కాంగ్రెస్ నాయ‌కులే అంటున్నారు. కోట్ల రూపాయాల‌కు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వీళ్ల‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ గ్యారెంటీల‌ను న‌మ్మ‌రు. ఆగం కావొద్దు.. అభివృద్ధిలో భాగం కావాలి అని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version