ఇవాళ, రేపు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలి – కిషన్‌ రెడ్డి

-

 

స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. విద్యానగర్ శివం రోడ్ లోని ATI లో మొక్కలు నాటిన కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు రోజులపాటు దేశంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో ప్రతి ఒక్కరు 75వ స్వాతంత్ర వేడుకలలో భాగ్యసాములు కావాలని.. ప్రతి గ్రామంలో యువకులు తిరంగ యాత్ర మోటార్ సైకిల్ లతో ర్యాలీ నిర్వహించాలని కోరారు. దేశ వ్యాప్తంగా ప్రతి మండల్, జిల్లా కేంద్రాలలో పాటు ఢిల్లీలో కూడా 75 మొక్కలు నాటాలని.. ఈ సందర్భంగా చెట్లను నాటే కార్యక్రమాన్ని అమృత వనంగా పేరు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలని..దేశంలో నిరుద్యోగ పేదరిక, సమస్యను నిర్మూలన చేయాలని వెల్లడించారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి.  ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఒక్కరు భాగ్యస్వాములు కావాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news