త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో నీరా సెంటర్లు ఏర్పాటు

-

నీరా సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం, తర్వాత సిరిసిల్ల జిల్లా లో ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర ప్రకటించారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ని అధికారికంగా జరుపుతున్నాం అని పేర్కొన్నారు. ఆత్మ గౌరవం కోసం సర్వాయి పాపన్న పోరాటం చేశారు. 10 మంది తో మొదలైంది ఆయన సైన్యం.. చివరగా గోల్కొండ పై జెండా ఎగుర వేసారు. తెలంగాణ పోరాటం కూడ అలాగే జరిగింది అని గుర్తు చేశారు. జిల్లా గౌడ సంఘం కోసం 2 ఎకరాల స్థలం ను అందిస్తున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణం కోసం 2 కోట్లు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news