నీరజ్ హత్యతో మా కుటుంబ ప్రమేయం లేదు – సంజన తల్లి

-

నీరజ్‌ హత్య కేసులో సంజన తల్లి మధుబాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని.. హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. నీరజ్ హత్యతో మా కుటుంబ ప్రమేయం లేదని.. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారని… వాళ్లు ఎవరనేది తెలియదన్నారు.

హత్య జరిగిన సమయంలో నా కుమారుడు రితేష్, బావ కుమారులు నలుగురు ఇంట్లోనే ఉన్నారని.. హత్య తో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. హత్య జరిగిన విషయం తెలుసుకొని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారన్నారు.

ఏడాదిగా మా సోదరితో మా కుటుంబానికి మాటలు లేవని.. మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా సంజన నాతో ఫోన్లో మాట్లాడుతుందని వెల్లడించారు సంజన సోదరి మమత. ప్రేమ వివాహం ఇష్టం లేకే ఆమెని దూరం పెట్టాము… భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నామని చెప్పారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు..హత్యతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సంజన సోదరి మమత.

Read more RELATED
Recommended to you

Latest news