BRSలోకి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం మేనల్లుడు

-

BRS పార్టీ జాతీయ స్థాయిలో దూసుకుపోతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా మంది నేతలను లాగేసుకుంది. ఇక తాజాగా BRSలోకి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం మేనల్లుడు కూడా వచ్చారు. BRS అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో సోమవారం వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

సీఎం కేసీఆర్ ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ మేనల్లుడు సంజయ్ యాదవ్, ఆ రాష్ట్ర రేవా మాజీ ఎంపీ బుద్ సేన్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ ప్రతాప్ నలవాడే, కళ్యాణి డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రమేష్ జాదవ్, ముంబై కార్పొరేటర్లు కళ్యాణ్ గైక్వాడ్, సందీప్ జాదవ్, దినేష్ జాదవ్, హల్దార్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంఘటన్ అధ్యక్షుడు శ్యామ్ భవర్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news