త్వరలోనే కొత్త రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

త్వరలోనే  కొత్త రేషన్ కార్డు లు అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సెషన్ లోనే కొత్త రేషన్ కార్డు గైడ్ లైన్స్ మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని.. భవిష్యత్ లో రేషన్ కార్డుకు ఏ పథకాలకు లింక్ ఉండదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల గైడ్ లైన్స్ త్వరలోనే విడుదల చేస్తాం.

రేషన్ కార్డుల విషయంలో సబ్ కమిటీ వేసి, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. రేషన్ కోసం రేషన్ కార్డులు, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. అలాగే నేషనల్ డ్యామ్  సేఫ్టీ అథారిటీ రెండు రోజులుగా అన్ని రకాల అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. గేట్లు ఓపెన్ ఉన్నాయి. వరద నీటిని చూపించి డ్యామ్  సేఫ్టీ గానే ఉందని బిఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ పిచ్చి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని సార్లు కాళేశ్వరం సందిర్శించినా మాకు ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు మేడిగడ్డ వెళ్లినా మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళ లాగా మేం అడ్డుకోవడం లేదన్నారు మంత్రి ఉత్తమ్.

 

Read more RELATED
Recommended to you

Latest news