పీయూష్‌ గోయల్‌ వి బరితెగింపు మాటలు : నిరంజన్‌ రెడ్డి ఫైర్‌

-

పీయూష్‌ గోయల్‌ కు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ ది బరితెగింపు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అవే పాత అబద్దాలే వల్లె వేశాడని.. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికమని నిప్పులు చెరిగారు.


మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఎ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మరి నాడు మోడీ చేసింది బెదిరింపేనా ? అని నిలదీశారు. కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగ విరుద్దమని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.

బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోెయల్ కు పదవిలో ఉండే అర్హత ఉందా ? రైతులకు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్ లో రాష్ట్రాల నుండి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news