నిన్నగాక మొన్న వచ్చిన వారికే పదవులు వచ్చాయన్నదే మా వాదన – భట్టి

-

కాంగ్రెస్ పార్టీలో వరుస పరిణామాల నేపథ్యంలో సీనియర్లు మంగళవారం సాయంత్రం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి సీనియర్ నేతలకు ఫోన్లు చేయడంతో ఈ సమావేశం కాస్త వాయిదా పడింది. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకుందాం అని దిగ్విజయ సింగ్ సీనియర్ నేతలకు సూచించారు. దీంతో నేటి సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు టీ కాంగ్రెస్ నేతలు.

ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తాము ఎవరిని పార్టీకి రాజీనామా చేయాలని కోరలేదని.. వారంతా తమ మిత్రులేనని స్పష్టం చేశారు. కానీ పార్టీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారికి మాత్రం అన్యాయం జరిగిందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన వారికి పదవులు వచ్చాయన్నదే తమ వాదన అని పేర్కొన్నారు బట్టి విక్రమార్క. అంతేకానీ ఎవరినీ తొలగించాలని మేము చెప్పలేదన్నారు. పార్టీలో సంక్షోభాన్ని అధిష్టానమే సరిదిద్దాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news