రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది – సీఎం రేవంత్ రెడ్డి

-

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి శ్రీవీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు సమావేశమైంది. రాష్ట్ర ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని.. కాబట్టి పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేశారు.

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేశారు సీఎం రేవంత్. అలాగే ఫాక్సాకాన్ సంస్థ చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇక మార్చ్ 2023లో తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఫాక్స్ కాన్ గ్రూప్ ఒప్పందం కుదిరింది. ఫాక్స్ కాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. ఈ సంస్థ మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25వేల ఉద్యోగాలు కల్పించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news