మా నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టారు : కడియం శ్రీహరి

-

అసెంబ్లీలో మా నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టారు.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అనుచిత భాష‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌కు వెళ్ల‌కుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకోవ‌డం హాస్యస్పదమని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతూ.. చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి. రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు.

సీఎం భాషకు ధీటుగా బదులు ఇవ్వగలం.. కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉందన్నారు.ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే ఆవకాశం ఇవ్వలేదు. బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు. కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా ? అని క‌డియం శ్రీహ‌రి ప్ర‌శ్నించారు. ముఖ్యంగా బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news