పల్లాకు ముత్తిరెడ్డి సవాల్‌… నా ప్రాణాలు ఇస్తా !

-

జనగామలో బీఆర్ఎస్ నాయకుల కొట్లాట కొనసాగుతోంది. ముఖ్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిగా వారి పంచాయితీ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే… బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసారు జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.

జయప్రద అనే మీ అక్కకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు లాక్కొని ఆమెను మానసిక వేదనకు గురి చేశావు అంటూ పల్లా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనగామ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని.. జనగామ ప్రజలతో సంబందం లేని వ్యక్తివి, నీవు ఎలా సేవా చేస్తావో చెప్పాలని పేర్కొన్నారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగానికైనా సిద్దమని జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news