కాంగ్రెస్ కుక్కలను మన దొడ్లోనే కట్టేస్తం.. పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుక్కలు అని రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ తన సొంత గ్రామం అయినటువంటి షోడషపల్లిలో జనగామ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ..  అధికార టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకున్నా 12 మంది కాంగ్రెస్ నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉన్న మతలబును విడమరిచి చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కుక్కల్లా అరుస్తారని అలాంటి కుక్కలను మన పార్టీలో చేర్చుకొని పిల్లుల్ని చేశామని.. సీఎం కేసీఆర్ ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలను కండువాలు కప్పుతున్నారని కార్యకర్తలతో బహిరంగంగా చెప్పేశారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

జనగామ టికెట్ ని ఆశిస్తున్న నేపథ్యంలో తన స్వగ్రామం షోడషపల్లిలో జనగామ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ.. పార్టీ గొప్పదని పేర్కొంటూ తనకే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్న తీరును వివరిస్తూనే ప్రతిపక్షంలో ఎవరినీ నోరెత్తకుండా ఎలా వ్యవహరిస్తున్నారో సీఎం కేసీఆర్ తరచూ తనతో చెబుతుండేవారని కుందబద్దలు కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీలో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై కుక్కల్లా అరుస్తున్నారని అందుకే సీఎం కేసీఆర్ అరిచే కుక్కలను టీఆర్ఎస్ లో చేర్చుకొని పిల్లుల్లా మార్చారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగబోతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news