తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..ఈ నెలలో 2 వేల పల్లె ధావాఖనాలు ప్రారంభం

-

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖనాలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం.సద్దితిన్న రేవు తలవాలి. నియత్ ఉంటేనే బర్కత్ ఉంటదనీ సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరారు. గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలో ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుండన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news