కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : వరంగల్ సీపీ

-

దేశవ్యాప్తంగా నిన్నటి నుండి అమలవుతున్న నూతన క్రిమినల్ న్యాయ చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముమ్మర ప్రచారం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. నూతన క్రిమినల్ న్యాయ చట్టాలతో రూపొందించిన క్రిమినల్ సీజర్ యాక్ట్స్ పుస్తకాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేసే కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ అధికారులకు ఈ పుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నూతన నేర చట్టాల ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం అందించడం జరగడంతో పాటు, సమయం ఆదా అవుతుందన్నారు. ఈ నూతన నేర చట్టాలపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించే విధంగా తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రచారం జరిపించాలని చెప్పారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news