రేపే తెలంగాణకు ప్రధాని మోడీ.. షెడ్యూల్‌ ఇదే

-

రేపే తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ విడుదల చేసింది పిఎంవో కార్యాలయం. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ.

ఇందులో భాగంగానే.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్ కు 9.45 గంటలకు చేరుకుంటారు. 9:45 గంటలకు హెలికాప్టర్‌ లో వరంగల్‌ కు పయనం అవుతారు. 10.15 గంటలకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా 10:30 భద్రకాళి టెంపుల్ కు చేరుకుంటారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని 10:45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11:00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు చేరుకుంటారు.

11 నుంచి 11.30 గంటల మధ్య వర్చువల్ గా 6110 కోట్లతో చేపట్టే జాతీయ రహదారులకు, 521 కోట్లతో చేపట్టే కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ అండ్ మ్యానుప్యాక్షరింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు. 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు బిజేపి విజయ సంకల్ప బహిరంగ సభకు హాజరు అవుతారు. 12.50 గంటలకు వరంగల్ మామునూరు హెలిప్యాడ్‌ నుంచి హకీంపేటకు పయనం అవుతారు. 1.45 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాజస్థాన్ కు మోదీ తిరుగు పయనం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news