హయత్ నగర్ బాలిక కిడ్నాప్ కేసు అంతా నాటకమే..తేల్చిన పోలీసులు

-

హైదరాబాద్‌ హయత్ నగర్ బాలిక కిడ్నాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హయత్ నగర్ బాలిక కిడ్నాప్ అత్యాచార యత్నం నాటకమని పోలీసులు తేల్చి చెప్పారు. అసలు వివరాల్లోకి వెళితే… స్నాప్ చాట్ లో బాలికకు అరవింద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. దీంతో స్నాప్ చాట్ లో తరచూ చాటింగ్ చేసుకున్నారు బాలిక, ఆ యువకుడు.

అక్కడితో ఆగకుండా… ఒకరికొకరు ఫోటోలు సైతం పంపించుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బయటికి వచ్చింది ఆ బాలిక. ద్వి చక్రవాహనంపై అరవింద్ వెంట వెళ్లింది బాలిక. నిర్మానుష ప్రాంతంలోకి బాలికను తీసుకెళ్లాడు అరవింద్. ఇక అప్పటికే అక్కడ ఉన్న హిజ్రాను చూసి అక్కడి నుంచి వచ్చేసారు బాలిక, అరవింద్. అరవింద్ తో వెళ్లిన విషయం తెలుస్తుందనే భయంతో కిడ్నాప్ నాటకమాడింది ఆ బాలిక. తనను బైక్ పై ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులకు చెప్పింది బాలిక. అయితే.. ఈ విషయాన్ని విచారణలో తేల్చేశారు పోలీసులు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news