రేపు అదిలాబాద్ కు ప్రధాని మోడీ…1600 మంది పోలీసులతో బందోబస్తు

-

రేపు ఆదిలాబాద్‌ కు ప్రధాని మోడీ రానున్నారు. ఈ తరుణంలోనే… 15 జిల్లాలకు చెందిన 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ఆదిలాబాద్‌ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. ఇవ్వాళ, రేపు ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎరోడ్రం, సభా స్థలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ల ఎగరవేతపై నిషేధం విధించారు పోలీసులు. అటు సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

కచ్ కంటి గ్రామ ప్రజలు ఆదిలాబాద్ పట్టణానికి రావడానికి పాత సాత్నాల రహదారిని వాడుకోవాలి… ఎరోడ్రం లోనికి అనుమతి ఉండదని తెలిపారు పోలీసులు. కె ఆర్ కె కాలనీ వాసులు పట్టణంలోకి రావడానికి మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు ఉన్న రోడ్డు ను వాడుకోవాలని… అంకోలి, తంతోలి గ్రామ ప్రజలు ఆదిలాబాద్‌ పట్టణంలోకి రావడానికి కృష్ణా నగర్ మీదుగా మావల పీ ఎస్ ముందు ఉన్న రోడ్డు వైపు నుంచి రావాలని ఆదేశించారు. ప్రధానమంత్రి సభకు విచ్చేస్తున్న ప్రజలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల పార్కింగ్ ప్రదేశం వినాయక చౌక్ ఏరియాలో మధుర జిన్నింగ్ , గౌతమ్ మోడల్ స్కూల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news