ఇవాళ,రేపు తెలంగాణలో మోడీ పర్యటన..షెడ్యూల్‌ ఇదే

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ, రేపు తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. మళ్ళీ 18న తెలంగాణకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు ప్రధాని మోడీ. ఇక ఇవాళ సాయంత్రం 5.15 నుంచి 6.15 వరకు మల్కాజ్ గిరిలో రోడ్ షో పాల్గొంటారు.

pm modi

మిర్జాలగూడ నుంచి మల్కాజిగిరి cross రోడ్ వరకు.. 1.2 కిలోమీటర్ ల రోడ్ షో చేయనున్నారు. ఇక రేపు ఉదయం నాగర్ కర్నూల్ కు మోడీ వెళతారు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు మోడీ. ఈ సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఫిక్స్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news