వరంగల్ లో చిన్నారితో మోదీ ముచ్చట్లు.. ఫొటో వైరల్

-

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రోజున రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. మొదట వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మోదీ అనంతరం వేములవాడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం వరంగల్లో పర్యటించి అక్కడ బీజేపీ సభలో ప్రసంగించారు. ఈ విషయాలను మోదీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో షేర్ చేశారు.

ఈ పర్యటనలో ఎన్నికలకు సంబంధించిన పోస్టులే కాకుండా ఓ క్యూట్ పోస్టు కూడా షేర్ చేశారు ప్రధాని. ఈ పర్యటనలో ఓ చిన్నారిని మోదీ ముద్దాడిన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా తిమ్మాపూర్ లోని లక్ష్మీపురం ఓరుగల్లు జనసభలో ఆయన పాల్గొన్నారు. తిరిగి వెళుతున్న క్రమంలో లక్ష్మీపురం వద్ద ఓ చిన్నారిని ఎత్తుకొని లాలించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోను పోస్టు చేసిన మోదీ.. ప్రచారానికి వెళ్తుండగా నా క్యూట్ ఫ్రెండ్ను కలిసి ముచ్చటించానంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news