పొంగులేటి, అదానీ, సునీల్ కొనుగోలు రహస్య సమావేశం..!

-

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీని హోటల్లో కలిశాడని.. అందులో సునీల్ కొనుగోలు ఉన్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియా సంచలన ఆరోపనలు చేస్తోంది. అయితే.. దీనిపై కేఏ పాల్‌ స్పందించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీని హోటల్లో ఎందుకు కలిశాడు.. అందులో సునీల్ కొనుగోలు ఎందుకు ఉన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ponguleti, Adani, Sunil purchase secret meeting

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు.. అందరికి టోపీలు పెడుతుంటాడని బాంబ్‌ పేల్చారు. వీళ్లకు ఓట్లు వేయడానికి ప్రజలకు కూడా బుద్ధి లేదని చురకలు అంటించారు కేఏ పాల్. ప్రజలకు కూడా బుద్ధి లేదు. రూ. 5,000/- తీసుకుని ఓట్లు వేస్తున్నారని… ఇకనైనా ఓటర్లు ఆలోచనతో ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మార్పు రావాలని కోరారు. కాంగ్రెస్ వద్దు అంటే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు జనం…. మళ్లీ వాళ్లను ఎందుకు తీసుకురావాలి? అందరూ ఒకటే కదా అంటూ సెటైర్లు పేల్చారు కేఏ పాల్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version