దసరాలోపు రూ.2 లక్షల పైన ఉన్నవారి రుణమాఫీ

-

దసరాలోపు రూ.2 లక్షల పైన ఉన్నవారి రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ప్రకటన చేసింది. ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం.. దసరాలోపు రూ.2 లక్షల పైన ఉన్నవారి రుణమాఫీ చేస్తామని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు లాభపడే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంటుందని అన్నారు.

రైతాంగంపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, బాధ్యతలు అంటే రాజకీయ పదవులు కాదని అన్నారు. 60 వేల కోట్ల మిగులుతో ఏర్పడిన రాష్ట్రం నేడు 7వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మండిపడ్డారు. వరదలతో పదివేల కోట్లకు పైగా నష్టం జరిగితే కేవలం కేంద్రం ఇచ్చింది 400 కోట్లు మాత్రమే అని అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ అసెంబ్లీకి కూడా రావడంలేదని.. గజ్వేల్ లోను కేసీఆర్ ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని మండిపడ్డారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news