కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి – పొన్నం ఫైర్‌

-

కరీంనగర్ లో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలని మంత్రి పొన్నం ఫైర్‌ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..అనంతరం మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలని..మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదు, ప్రజాస్వామ్యతంగా ఓట్లు అడగాలని కోరారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని… ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బిజెపి ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు.48 గంటల వ్యవధిలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన ఘనత మాదేనని…రేపు 27వ తేదీన చేవెళ్లలో 500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. మేము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నాం, కేంద్రం నుండి 500 రూపాయల రిఫండ్ ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ చెప్పాలని ఫైర్‌ అయ్యారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Latest news