BREAKING: ఇవాళ మధ్యాహ్నం ప్రభాస్ తో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశం

-

 

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్..రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాజ్‌నాథ్‌.. రానున్నారు. అనంతరం ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కుటుంబీకులను పరామర్శించనున్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌. ఫిల్మ్ నగర్‌లో కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.. సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇవాళ రాత్రి 9 గంటల 50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజేంద్ర నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.ఏడు కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని అమిత్ షా స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 13 వందల మంది కళాకారుల ప్రదర్శనను తిలకించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news