పీవీకి భారతరత్న.. స్వీకరించిన కుటుంబ సభ్యులు

-

దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు.

 

ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ సింగ్‌, కర్పూరీ ఠాకూర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, స్వామినాథన్‌ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ స్వయంగా అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news