తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ, అమిత్ షా శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు ప్రధాని మోడీ, అమిత్ షా.

“రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, నా తెలంగాణా సోదర, సోదరీ మణులకు శుభాకాంక్షలు. కష్టపడి పని చేయడంలో, దేశాభివృద్ధికి పాటుపడడంలో పేరు పొందినవారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ప్రపంచ ప్రఖ్యాతి పొందినది తెలంగాణా రాష్ట్ర సంస్కృతి. తెలంగాణా ప్రజల శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక అటు అమిత్ షా కూడా తెలుగులో ట్వీట్ చేశారు.

“దేశ ప్రగతి కోసం కట్టుబడిన యువత కృషితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని కోరుతూ..తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.” అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news