తెలంగాణలో పగా వేసేందుకు ప్రధాని మోడీ బిగ్ స్కెచ్ !

-

తెలంగాణలో పగా వేసేందుకు ప్రధాని మోడీ బిగ్ స్కెచ్ వేశారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ రానున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ. అలాగే… నామినేషన్ల తర్వాత ప్రచార పర్వాన్ని హోరెత్తించనుంది తెలంగాణ బీజేపీ.

Prime Minister Modi’s big sketch to take revenge in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల సభలకు ప్లాన్ వేసింది బీజేపీ పార్టీ. ఈ నెల చివరి వారంలో మేధావులతో ప్రధాని మోడీ భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వరసగా అగ్ర నేతల పర్యటన కూడా కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరి నుంచి బీజేపీ అగ్ర నేతల ప్రచార సభలు, రోడ్ షోలు ఉంటాయి. ఇలా అన్ని వ్యూహ్యాలతో బీజేపీ దూసుకుపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news