BREAKING : అప్సర కేసులో నిందితుడు పూజారి సాయి చర్లపల్లి జైలుకు తరలింపు

-

అప్సర హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు పూజారి సాయికృష్ణపై 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరచగా… కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సాయి కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా, అప్సర అనే యువతని సాయికృష్ణ హత్యచేసి సరూర్ నగర్ లో మ్యాన్ హోల్ లో పడేసిన ఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. కాగా, ఆ దారుణం శంషాబాద్ లో చోటు చేసుకుంది. అప్సరా అనే అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు పూజారి సాయి కృష్ణ. హత్య తరువాత మృతదేహాన్ని సరూర్ నగర్ వద్దకు తీసుకొని మురికి కాలువలో పడేసి మట్టితో పూడ్చిపెట్టాడు పూజారి సాయి.

Read more RELATED
Recommended to you

Latest news