PV ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఆర్థిక శక్తిగా ఎదిగింది – పొన్నాల లక్ష్మయ్య

-

నేడు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ ని గుర్తుకు చేసుకోవడం అంటే ఈ దేశ చరిత్రను మరోసారి గుర్తుకు చేసుకోవడమే అని అన్నారు. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న వ్యక్తి పీవీ అని.. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడిన వ్యక్తి అని కొనియాడారు. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు.

ఒక సామాన్య న్యాయవాది పీవీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని చేసిందని గుర్తు చేశారు. ఆనాడు ఈ విమర్శించే వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య. నేడు పీవీ ని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈనాటి రాజకీయాలు అధికారం కోసం మాత్రమే ఉన్నాయన్నారు. పీవీ భూ సంస్కరణలు తెచ్చినప్పుడు, ఒక సామాన్య వ్యక్తి పీవీ ని కాంగ్రెస్ పార్టీ ప్రధానిని చేసినప్పుడు ఈ విమర్శించే నోర్లు ఎక్కడ ఉన్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news