టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుంది – రఘునందన్ రావు

-

టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుందని బాంబ్‌ పేల్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇవాళ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో 80 మంది దళితుల భూములు అక్రమంగా వెంకట్ రాం రెడ్డి లాక్కున్నారని… క్షీర సాగర్ నుంచే పని మొదలుపెడతా.. దళితుల భూములు వారికి అప్పగించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ITIR ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేశామని… ITIR ప్రాజెక్టు టెక్నికల్ గా మాత్రమే రద్దు అయ్యిందని ఫైర్‌ అయ్యారు.

raghunandhan rao about BRS

ITIR గురించి తెలిస్తే జగ్గారెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. టైటానిక్ షిప్ లా BRS మునిగిపోతుందని చరిత్రలో రాసుకోవాల్సిందేనని… BRS కు… CRS (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీం) ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. హరీష్ రావు, కెసిఅర్ ఎవరు వచ్చినా బీజేపీలోకి స్వాగతిస్తానని… బయ్యారం, ఖాజీపేట కొచ్ ఫ్యాక్టరీకి ఫీజుబిలిటీ లేదు.. ఫాజిబులిటీ లేదని ఎక్సపెర్ట్ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news