హైదరాబాద్ కి చేరుకున్న రాహుల్ గాంధీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అక్కడికే..!

-

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ఈవెంట్ జరిగే హైటెక్స్ లోని నోవాటెల్ కి బయలుదేరి వెళ్లారు. భారత్ సమ్మిట్ కార్యక్రమానికి దాదాపు 100 దేశాలకు పైగా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు
హాజరయ్యారు.

ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ దేశాల ప్రతినిధులను కోరనుంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెల్ కమ్ చెప్పారు. వీరంతా ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా హైటెక్ సిటీకి బయలు దేరారు. అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలతో కలిసి భారత్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించ నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news