రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

-

రాగల మూడు రోజులపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్‌, పరిసర ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆగ్నేయం వైపు వంగి ఉందని తెలిపింది. రుతుపవన ద్రోణి ఇవాళ జైసల్మేర్‌, అజ్మీర్‌, గుణ, తూర్పు మధ్యప్రదేశ్‌ పరిసర ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై అల్పపీడనం మీదుగా వెళ్తూ.. తూర్పు- మధ్య బంగాళాఖాతం వరకు సగటున సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని చెప్పింది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. పగటివేళ ముసురు వాన కురుస్తుండగా.. రాత్రిళ్లు వాన దంచికొడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news