భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా : రాజా సింగ్

-

భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోప్ టాప్ ప్రోగ్రాం చేసెవాళ్లపై చర్యలు తీసుకోవాలని.. మసీద్ వద్ద మేము కూడా సంతకాలు తీసుకోవాలా ? అని నిలదీశారు.

అలా చేస్తే రాష్ట్రంలో వాతావరణం దెబ్బతింటుందని.. రషిద్ ఖాన్ మీద సుమోటగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. చార్మినార్ పూర్తీగా శిథిలావస్థకు చేరుకుందని.. అటూ నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని వెల్లడించారు.

రషిద్ ఖాన్ కు సిగ్గుందా? తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది ? అని నిలదీశారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా నని.. రషిద్ ఖాన్ మసీద్ కు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. చార్మినార్ వద్ద సంతకాల సేకరణ చేస్తే పోలీసులు ఎం చేస్తున్నారు ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news