మరో సారి రిస్క్ చేస్తున్న రామ్ చరణ్..సెంటిమెంట్ రిపీట్ అని ఆందోళనలో ఫ్యాన్స్!

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..‘‘ట్రిపుల్ ఆర్’’…సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దేశవ్యాప్తంగా చరణ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. కానీ, ఆ తర్వాతనే విడుదలైన ‘ఆచార్య’ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా స్టోరి, మేకింగ్ పైన భారీ అంచనాలు ఉండగా, చివరికి నిరాశే మిగిలింది.

రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 ఫిల్మ్ చేస్తు్న్నారు. ఈ చిత్రానికి ‘అధికారి’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిస్క్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ న్యూస్ ప్రకారం..రామ్ చరణ్ ఈ చిత్రంలో ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడట. తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకుల పాత్రలను రామ్ చరణ్ పోషిస్తున్నారని సమచారం.

కమల్ హాసన్ ‘భారతీయుడు’ సినిమాలో మాదిరిగా తండ్రి పాత్ర ఉంటుందని టాక్. అయితే, ఈ చిత్రంలో తండ్రి పొలిటీషియన్. కాగా, ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఆవేశపరుడుగా, మరొకరు శాంతమూర్తిగా కనిపిస్తారని వినికిడి. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హీరోలు త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయని, ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి, కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే సేమ్ సెంటిమెంట్ రామ్ చరణ్ కు రిపీట్ అవుతుందా? లేదా శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా? అని చర్చించుకుంటున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి స్టోరి అందించగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news