మైనంపల్లిని బీజేపీలో చేర్చుకోం : రాంచందర్ రావు

-

BRS ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బిజెపిలో చేరనున్నారనే వార్తలను బిజెపి సీనియర్ నేత రామ్ చందర్ రావు ఖండించారు. గతంలో మైనంపల్లి తమ పార్టీ అగ్ర నేతలను దూషించారని, కార్యకర్తలను జైలుకు పంపారని గుర్తు చేశారు.

అలాంటి నేతలకు బిజెపిలో చోటు ఉండదని స్పష్టం చేశారు. తమ పార్టీలోనే సుశిక్షితులైన నేతలు ఉన్నారని తెలిపారు బిజెపి సీనియర్ నేత రామ్ చందర్ రావు. కాగా, భారత రాష్ట్ర సమితిని ఎన్నికల ముందు మైనంపల్లి హనుమంతరావు వీడనున్నారు. త్వరలోనే బిజెపి కండువా కప్పుకోనున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఇప్పటికే మైనంపల్లి ఇంటి వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు మైనంపల్లి హనుమంతరావు అనుచరులు. ఇక తాజాగా మైనంపల్లి హనుమంతరావు వికీపీడియా పేజీలో కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు… అప్డేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news