రంగారెడ్డి జిల్లాలో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం.. గుప్త నిధుల కోసమేనా ?

-

Rangareddy District Unidentified persons vandalized the idol of Goddess Durga : తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. గుప్తనిధుల కోసం ఏకంగా దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది దుర్మార్గులు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి.. రంగారెడ్డి జిల్లా మహిళాదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో… పులిగుట్ట వద్ద దుర్గ మాత విగ్రహం ఉంది. ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది.

Rangareddy District Unidentified persons vandalized the idol of Goddess Durga at Puligutta in Mailer Dev Palli Police Station area

అయితే దుర్గ మాత విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు ధ్వంసం చేయడం జరిగింది. ఆ దుర్గ మాత దేవాలయం సమీపంలో తవ్వకాలు కూడా జరిపినట్లు పోలీసులు గుర్తించారు. దాని బట్టి చూస్తుంటే గుప్త నిధుల కోసం… కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసి ఉంటారని చెబుతున్నారు. ఇక ఈ విషయంపై పోలీసులకు స్థానిక భక్తులు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు బుక్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version