ఇప్పుడే కాంగ్రెస్ చేరను… బీఆర్‌ఎస్‌లోనే ఉంటా – రేఖా నాయక్‌

-

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్…కన్నీళ్లు పెట్టుకున్నారు. తన వద్దకు వచ్చిన వారి తో మాట్లాడుతూ బోరున విలపించారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. తనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీపై సీరియస్‌ అయ్యారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. మార్టీ మారడంపై నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు…రాత్రి పగలు అని చూడకుండా ప్రజల్లో ఉన్నానని పేర్కొన్నారు.ఇప్పుడే కాంగ్రెస్ చేరను… బీఆర్‌ఎస్‌లోనే ఉంటానని ప్రకటించారు రేఖా నాయక్‌.

మూడో సారి గెలిస్తే మంత్రి పదవి వస్తుంది అని ఇలా చేసారని ఆగ్రహించారు. మహిళ గా పక్కకు జరపడం భాద గా ఉందని.. పార్టీ కోసం ఎంతో పని చేశానని వెల్లడించారు. ఆరు నెలల్లో ఏ సర్వే లో ఆయన కు ఎం వచ్చిందో ఎమో నాకు తెలియదని చెప్పారు. జాన్సన్ నాయక్ ఏం ఉద్ధరించాడో నాకు తెలియదు..నేను చేయనిది ఏంటి జాన్సన్ నాయక్ చేసింది ఏంటి.,,నేను పార్టీని అడుగుతానన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. ట్రైబల్ మహిళను పక్కకు జరపడం భాద గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news