తెలంగాణ హై కోర్టులో నాగార్జునకు ఊరట

-

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించాడు హీరో నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.  200 మంది పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు అక్రమంగా చేపట్టారు.  2014లో అప్పటి ఇరిగేషన్, GHMC అధికారులు బిల్డింగ్ ని కూల్చివేస్తామని హెచ్చరించారు. FTLలో బిల్డింగ్ ఉందని.. అప్పటి అధికారులు కూల్చేందుకు వచ్చారు. 2014లో హైకోర్టు ఎన్క న్వెన్షన్ పై ఆర్డర్ ఇచ్చింది. అప్పటికీ ఇంకా ఎఫ్.టి.ఎల్ ను నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ మాదాపూర్ లోని తుమ్మిడి చెరువులోని అక్రమ నిర్మాణాలను హైడ్రా  అధికారులు కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామునే రంగంలోకి దిగి హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు. తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నాగార్జున నిర్మించారని వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news