న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి – రేవంత్‌

-

న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ గారిపై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయి..కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ ఎంపీ.పదవిపై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గం అన్నారు రేవంత్‌ రెడ్డి.

సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందని… న్యాయం గెలిచింది. ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్ళీ విశ్వసం పెరిగిందని వివరించారు. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచారని చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news